కదిలిన అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సులు

ABN , First Publish Date - 2021-06-22T05:51:04+05:30 IST

కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ కారణంగా గత నెల 5వ తేదీ నుంచి నిలిచిన అంతర్రాష్ట్ర పీటీడీ(ఆర్టీసీ) బస్సు సర్వీసులు సోమవారం పునః ప్రారంభమయ్యాయి.

కదిలిన అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సులు
మద్దిలపాలెం డిపోలో బయలుదేరేందుకు సిద్ధంగా వున్న బస్సులు

ద్వారకాబస్‌స్టేషన్‌, జూన్‌ 21 : కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ కారణంగా గత నెల 5వ తేదీ నుంచి నిలిచిన అంతర్రాష్ట్ర పీటీడీ(ఆర్టీసీ) బస్సు సర్వీసులు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. కర్ఫ్యూ నిబంధనలు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సడలింపు ఇవ్వడంతో ఆ సమయంలో గమ్యస్థానాలకు చేరుకునే అంతర్రాష్ట సర్వీసులను ఆపరేట్‌ చేస్తున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్‌, భద్రాచలం, విజయవాడ వంటి దూర ప్రాంతాలకు బస్సులు నడిచాయి. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి మంగళవారం నుంచి అంతరాష్ట్ర సర్వీసులు పెంచుతామని పీటీడీ విశాఖ రీజియన్‌ అధికారులు వెల్లడించారు. 


Updated Date - 2021-06-22T05:51:04+05:30 IST