చంపేస్తామంటున్నారు..
ABN , First Publish Date - 2020-08-13T09:20:51+05:30 IST
అయోధ్యలో రామాలయానికి భూమిపూజ సందర్భంగా అభినందనలు చెప్పినందుకు తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని టీమిండియా పేసర్ మహ్మద్
షమీ భార్య ఫిర్యాదు
కోల్కతా: అయోధ్యలో రామాలయానికి భూమిపూజ సందర్భంగా అభినందనలు చెప్పినందుకు తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహా తెలిపింది. ఈ మేరకు ఆమె కోల్కతా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 5న రామాలయానికి ప్రధాని మోదీ భూమిపూజ చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా హసీన్ సోషల్మీడియా ద్వారా హిందువులకు అభినందనలు తెలిపింది. దాంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనను దూషించడంతోపాటు రేప్ చేసి చంపేస్తామని సోషల్మీడియాలో బెదిరిస్తున్నారని ఆమె తన ఫిర్యాదు పేర్కొంది.