శంషాబాద్ ఎయిర్పోర్టులో మహిళ అదృశ్యం కలకలం
ABN , First Publish Date - 2021-01-10T16:30:54+05:30 IST
నగర శివార్లలోని శంషాబాద్ ఎయిర్పోర్టులో మహిళ అదృశ్యం కలకలం రేపుతోంది. కుమార్తెకు వీడ్కోలు పలికేందుకు వెళ్లిన మహిళ మళ్లీ ఇంటి తిరిగి...
హైదరాబాద్: నగర శివార్లలోని శంషాబాద్ ఎయిర్పోర్టులో మహిళ అదృశ్యం కలకలం రేపుతోంది. కుమార్తెకు వీడ్కోలు పలికేందుకు వెళ్లిన మహిళ మళ్లీ ఇంటి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ప్రకాశం జిల్లాకు చెందిన శోభారాణి అదృశ్యంపై శనివారం రాత్రి తన కూతురును విమానం ఎక్కించడానికి వెళ్లిన ఆమే తిరిగి రాకపోవడంతో శంషాబాద్ విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.