కేసీఆర్, సంజయ్ ఇద్దరూ తోడు దొంగలే: షర్మిల
ABN , First Publish Date - 2021-07-09T01:13:29+05:30 IST
సీఎం కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇద్దరూ తోడు దొంగలలేనని వైఎస్సాఆర్ తెలంగాణ
హైదరాబాద్: సీఎం కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇద్దరూ తోడు దొంగలలేనని వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. కేసీఆర్ అవినీతిపై ఆధారాలున్నాయని పదేపదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెబుతున్నాడని, మరి ఆధారాలు ఎందుకు బయటపెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ను జైల్లో ఎందుకు పెట్టడం లేదన్నారు. ఇద్దరి మధ్య డీల్ కుదిరిందా అని ప్రశ్నించారు. ఇద్దరూ తోడు దొంగలేనన్నారు. ఇక్కడ అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి లేదా అని ఆమె ప్రశ్నించారు. వైఎస్ గురించి చెడుగా మాట్లాడితే ఉరికించి కొడతారని షర్మిల పేర్కొన్నారు.