షర్మిల పాదయాత్రను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-10-18T04:38:56+05:30 IST

షర్మిల పాదయాత్రను విజయవంతం చేయాలి

షర్మిల పాదయాత్రను విజయవంతం చేయాలి
వికారాబాద్‌: పాదయాత్రలో పాల్గొన్న సంగమేశ్వర్‌, వికారాబాద్‌ నాయకులు

వికారాబాద్‌: ఈనెల 20వ తేదీ నుంచి వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేవెళ్ల నుంచి చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని వైఎ్‌సఆర్‌టీపీ చేవెళ్ల పార్లమెంట్‌ కో కన్వీనర్‌ మామిడి సంగమేశ్వర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం పాదయాత్రలో భాగంగా వైఎస్‌ షర్మిల లోట్‌సపాండ్‌ నుంచి చిలుకూరు వరకు పాదయాత్రగా వచ్చి స్వామివారిని దర్శించుకోగా వికారాబాద్‌ పార్టీ నాయకులు పాదయాత్రలో నడిచి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రతో రాష్ట్రంలో వైఎ్‌సఆర్‌టీపీ ఒక ప్రభంజనం సృష్టించబోతోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్‌ వైఎ్‌సఆర్‌టీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T04:38:56+05:30 IST