రైతులను నట్టేట ముంచిన వైసీపీ: శశిభూషణ్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-29T17:39:33+05:30 IST

వైసీపీ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి అన్నారు.

రైతులను నట్టేట ముంచిన వైసీపీ: శశిభూషణ్‌రెడ్డి

గుంటూరు: వైసీపీ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండేన్నరేళ్లలో వైసీపీ వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలిచ్చి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. రైతులకు కేంద్రం ఇచ్చే నిధులు నవరత్నాలకు తరలిస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ జిల్లాల్లో అధిక వర్షంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. ధాన్యాన్ని సేకరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. త్వరలో కమీషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తామర పురుగు దాడిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పంట నష్టం అంచనాలు రూపొందించి కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. కిసాన్ ఫసల్ బీమా అమలు చేసి ఉంటే రైతులను ఆదుకోనే అవసరం ఉండేదని చెప్పారు. రాయలసీమలో అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని శశిభూషణ్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-29T17:39:33+05:30 IST