ఇంటి నిర్మాణపు పనులను పరిశీలించిన శశికళ
ABN , First Publish Date - 2021-04-11T15:24:55+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ చెన్నై పోయెస్ గార్డెన్ వద్ద నిర్మిస్తున్న కొత్త భవననిర్మాణపు పను
చెన్నై: మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ చెన్నై పోయెస్ గార్డెన్ వద్ద నిర్మిస్తున్న కొత్త భవననిర్మాణపు పనులను పరిశీలించారు. ఆ ప్రాంతంలోని జయలలిత అధికారిక నివాసగృహం వేదా నిలయం సమీపంలో శశికళకు చెందిన స్థలంలో అన్ని హంగులతో భవననిర్మాణపు పనులు వేగంగా జరుగుతున్నాయి. శశికళ, ఆమె బంధువులు వివేక్, ఇలవరసి తదితరులతో కలిసి ఆ భవనం వద్దకు వెళ్ళి నిర్మాణపు పనులను పరిశీలించారు. సుమారు రెండు గంటలపాటు శశికళ అక్కడ జరుగుతున్న కట్టడ నిర్మాణపు పనులను తిలకించారు.