ఈసుగాం శివమల్లన్న ఆలయంలో ముగిసిన శతచండీయాగం
ABN , First Publish Date - 2022-01-25T04:11:54+05:30 IST
మండలం లోని ఈసుగాం శివ మల్లన్న ఆలయంలో మూడురోజులుగా నిర్వ హిస్తున్న శతచండీ యాగం ముగిసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన జగద్గురు విద్యాశంకర భారతీ స్వామికి వేద బ్రాహ్మణుల బృందం ఘన స్వాగతం పలికింది.
కాగజ్నగర్ రూరల్, జనవరి 24: మండలం లోని ఈసుగాం శివ మల్లన్న ఆలయంలో మూడురోజులుగా నిర్వ హిస్తున్న శతచండీ యాగం ముగిసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన జగద్గురు విద్యాశంకర భారతీ స్వామికి వేద బ్రాహ్మణుల బృందం ఘన స్వాగతం పలికింది. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, సతీమణి రమాదేవి, ఆలయచైర్మన్ రాజేశ్వర్, భక్తులు పాల్గొన్నారు.
అన్నదాన సత్రంలో పూజలు..
కాగజ్నగర్: కాగజ్నగర్లోని ఎమ్మెల్యే కోనేరుకోనప్ప నిత్యాన్నదాన సత్రంలో సోమవారం జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధిపతి విద్యాశంకర భారతీస్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉచిత అన్నదానం తీరు తెన్నులపై ఎమ్మెల్యే కోనప్పతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్నదానం చేపట్టారు. కోనేరు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కోనేరు వంశీ, ఎమ్మెల్యే కోనప్ప సతీమణి కోనేరు రమాదేవి పాల్గొన్నారు.