shatrughan sinha కాంగ్రెస్ను వీడి టీఎంసీలో చేరనున్న శతృఘ్న సిన్హా
ABN , First Publish Date - 2021-07-12T13:24:13+05:30 IST
ప్రముఖ కాంగ్రెస్ నేత, బీజేపీ మాజీ ఎంపీ శతృఘ్న సిన్హా...
కోల్కతా: shatrughan sinha ప్రముఖ కాంగ్రెస్ నేత, బీజేపీ మాజీ ఎంపీ శతృఘ్న సిన్హా త్వరలో మమతా బెనర్జీని కలవనున్నారు. శతృఘ్న సిన్హా సన్నిహితులొకరు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ఆయన కాంగ్రెస్ను వీడి తృణమూల్ కాంగ్రెస్లో చేరనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం జూలై 21న ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ బీహార్ బాబు తిరిగి బీజేపీలో చేరుతారన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే బీజేపీతో ఉన్న విబేధాల కారణంగా ఆయన టీఎంసీలోనే చేరనున్నారనేది స్పష్టమవుతోంది. 2024 సాధారణ ఎన్నికల నాటికి పీఎం మోదీకి పోటీనిచ్చే ధీటైన నేతగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మారనున్నారని భావిస్తున్న తరుణంలో శతృఘ్న... మమత పంచన చేరాలని భావిస్తున్నారని తెలుస్తోంది. టీఎంసీ నేతలు కూడా ఇదే విషయమై మాట్లాడుతూ శతృఘ్న సిన్హా తమ పార్టీలో చేరనున్నారనే సంకేతాలు అందుతున్నాయని చెబుతున్నారు.