జాబ్ కోసం సిటీకెళ్లిన భర్త.. మా బంధువు అంటూ అత్తమామలకు చెప్పి ప్రియుడిని ఇంట్లో పెట్టింది.. చివరకు..

ABN , First Publish Date - 2021-08-10T00:21:40+05:30 IST

నాలుగు నెలల క్రితమే ఆమెకు పెళ్లయింది. భర్తతో చక్కగా సంసారం చేసుకుంటోంది. ఈ క్రమంలో పని కోసం ఆ భర్త ఢిల్లీ వెళ్లాడు.

జాబ్ కోసం సిటీకెళ్లిన భర్త.. మా బంధువు అంటూ అత్తమామలకు చెప్పి ప్రియుడిని ఇంట్లో పెట్టింది.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: నాలుగు నెలల క్రితమే ఆమెకు పెళ్లయింది. భర్తతో చక్కగా సంసారం చేసుకుంటోంది. ఈ క్రమంలో పని కోసం ఆ భర్త ఢిల్లీ వెళ్లాడు. అలా భర్త ఊరు విడిచి వెళ్లాడో లేదో ఆమె తన ప్రియుడికి ఫోన్ చేసింది. వెంటనే తన అత్తారింటికి పిలిపించుకుంది. అక్కడకు వచ్చిన ప్రియుడిని తమ బంధువంటూ అత్తమామలకు పరిచయం చేసింది. వాళ్లు నిజమే అనుకున్నారు. ఆ యువకుడికి అతిథి మర్యాదలన్నీ చేశారు. నాలుగు రోజుల పాటు వారి మర్యాదలన్నీ పొందిన ఆ ప్రియుడు.. తర్వాత తిరిగెళ్లిపోయాడు. అయితే మాటల సందర్భంలో చుట్టాల పేర్లు కూడా అతను చెప్పకపోవడంతో.. సదరు కుటుంబానికి అనుమానం వచ్చింది. ఈ ఘటన జార్ఖండ్‌లో వెలుగు చూసింది.


గొడ్డాకు చెందిన ఒక యువతికి కుందన్ అనే యువకుడితో నాలుగు నెలల క్రితం పెళ్లయింది. ఇటీవలే కుందన్.. పని కోసం ఢిల్లీ వెళ్లాడు. అప్పుడే ఆ యువతి తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. అతను తన బాబాయ్ అని చెప్పింది. అయితే మాటల మధ్యలో చుట్టాల పేర్లు, వివరాలు చెప్పడంలో ఆ యువకుడు తడబడ్డాడు. దీంతో కుందన్ తండ్రికి అనుమానం వచ్చింది. నాలుగు రోజుల తర్వాత ఆ యువకుడు వెళ్లిపోయాడు. కానీ కుందన్ తండ్రి అనుమానం తీరలేదు. ఆ యువకుడు మళ్లీ వస్తాడని ఆయనకు అనిపించింది. అనుకున్నట్లే శనివారం నాడు మళ్లీ ప్రియురాలి ఇంటికొచ్చాడా యువకుడు. అంతే అతన్ని గ్రామీణులంతా కలిసి పట్టుకొని కరెంటు స్తంభానికి కట్టేశారు. పోలీసులకు సమాచారమిచ్చి, అతన్ని అరెస్టు చేయించారు. అయితే తాను ఆ ఇంట్లో మర్చిపోయిన ఒక మందు కోసం వచ్చానని, తప్పుగా అర్థం చేసుకొని బంధించారని ఆ ప్రియుడు అంటున్నాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-08-10T00:21:40+05:30 IST