దుంపలు తిని గొర్రెలు మృతి
ABN , First Publish Date - 2021-03-10T01:31:33+05:30 IST
దుంపలు తిని గొర్రెలు మృతి చెందాయి.
తిరుపతి: దుంపలు తిని గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన జిల్లాలోని కలకడ మండలంలోని గుడిబండలో జరిగింది. గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు మేత కోసం గొర్రెలను తీసుకువెళ్లారు. అక్కడ చిలగడ దుంపలను గొర్రెలు తిన్నాయి. మనోహర్, సిద్దయ్య, రెడ్డమ్మకు చెందిన 106 గొర్రెలు ఈ దుంపలను తిన్న తరువాత కొద్ది సేపటికి మృతి చెందాయి. గొర్రెల మృతితో ఈ రైతులకు దాదాపు రూ.4.50 లక్షలు మేర నష్టo వాటిల్లింది. అధికారులు తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు.