దుంపలు తిని గొర్రెలు మృతి

ABN , First Publish Date - 2021-03-10T01:31:33+05:30 IST

దుంపలు తిని గొర్రెలు మృతి చెందాయి.

దుంపలు తిని గొర్రెలు మృతి

తిరుపతి: దుంపలు తిని గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన జిల్లాలోని కలకడ మండలంలోని గుడిబండలో జరిగింది. గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు మేత కోసం గొర్రెలను తీసుకువెళ్లారు. అక్కడ చిలగడ దుంపలను గొర్రెలు తిన్నాయి. మనోహర్, సిద్దయ్య, రెడ్డమ్మకు చెందిన 106 గొర్రెలు  ఈ దుంపలను తిన్న తరువాత కొద్ది సేపటికి మృతి చెందాయి. గొర్రెల మృతితో ఈ రైతులకు దాదాపు రూ.4.50 లక్షలు మేర నష్టo వాటిల్లింది. అధికారులు తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - 2021-03-10T01:31:33+05:30 IST