ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా శేఖర్‌

ABN , First Publish Date - 2020-09-23T07:06:51+05:30 IST

శాసన మండలి పట్టభద్రుల(ఎమ్మెల్సీ) ఎన్నికల టీఆర్‌ఎస్‌ మండల కో-ఆర్డినేటర్‌గా సారేపల్లి శేఖర్‌ నియమితులైనాడు. మంగళవారం ఈ మేరకు

ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా శేఖర్‌

చంద్రుగొండ, సెప్టెంబరు 22: శాసన మండలి పట్టభద్రుల(ఎమ్మెల్సీ) ఎన్నికల టీఆర్‌ఎస్‌ మండల కో-ఆర్డినేటర్‌గా సారేపల్లి శేఖర్‌ నియమితులైనాడు. మంగళవారం ఈ మేరకు అశ్వారావుపేట టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తాటి వెంకటేశ్వర్లు నియామక ఉత్తర్వులు సారేపల్లి శేఖర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్‌ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయానికి తన వంతు కృషి చేస్తానని, ఎన్నికలు ఏవైనా విజయం టీఆర్‌ఎస్‌ పార్టీదేనన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు ఎన్నికల బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

Updated Date - 2020-09-23T07:06:51+05:30 IST