మోదీ లడక్ పర్యటనపై దర్శకుడు శేఖర్ కపూర్ ప్రశంసల జల్లు

ABN , First Publish Date - 2020-07-04T04:37:03+05:30 IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడక్ పర్యటనపై బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ ప్రశంసలు కురిపించారు. లేహ్, లడక్ ప్రాంతాలకు విమాన మార్గంలో ప్రయాణించిన వారు అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటం

మోదీ లడక్ పర్యటనపై దర్శకుడు శేఖర్ కపూర్ ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడక్ పర్యటనపై బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ ప్రశంసలు కురిపించారు. లేహ్, లడక్ ప్రాంతాలకు విమాన మార్గంలో ప్రయాణించిన వారు అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల ఓ రోజు విశ్రాంతి తీసుకోవాలని అంతా చెబుతుంటారని అయితే మోదీ నేరుగా సైనికుల వద్దకు చేరుకుని ప్రసంగించారని శేఖర్ కపూర్ చెప్పారు. 


మోదీ వెళ్లిన నీము ప్రాంతం సముద్రమట్టానికి 11వేల అడుగుల ఎత్తులో ఉంది. సైనిక బలగాల స్థైర్యాన్ని పెంపొందించడంతో పాటు వారిలో స్ఫూర్తిని నింపేందుకు మోదీ యత్నిస్తున్నారంటూ నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ చేసిన ట్వీట్‌‌కు శేఖర్ కపూర్ సమాధానమిస్తూ ట్వీట్ చేశారు. జూన్ 15న గల్వాన్ లోయలో చైనా అకృత్యాన్ని శేఖర్ కపూర్ గతంలో ఎండగట్టారు. సామాజిక అంశాలపై సోషల్ మీడియా వేదికగా శేఖర్ కపూర్ నిరంతరం స్పందిస్తూ ఉంటారు. 

Updated Date - 2020-07-04T04:37:03+05:30 IST