అపోలోలో చేరిన మాజీ మంత్రి శిద్దా

ABN , First Publish Date - 2020-08-12T11:29:06+05:30 IST

మాజీ మంత్రి శిద్దా రాఘవరావు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో వైద్యశాలలో చేరారు.

అపోలోలో చేరిన మాజీ మంత్రి శిద్దా

ఒంగోలు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి శిద్దా రాఘవరావు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో వైద్యశాలలో చేరారు. మధ్యాహ్నం తర్వాత ఒంగోలు నుంచి బయల్దేరివెళ్లి ఆయన వైద్య శాలలో చేరారు. ఆయనకు కరోనా సోకిందా? సాధారణ వైద్య చికిత్స కోసం చేరేరా? అన్నది తెలియరాలేదు. కాగా ఆయన వద్ద పనిచేసే ఒక గన్‌మన్‌ రెండ్రోజుల క్రితం కరోనా బారినపడి ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-08-12T11:29:06+05:30 IST