శిల్పా చౌదరి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
ABN , First Publish Date - 2021-12-14T18:28:42+05:30 IST
హైదరాబాద్: శిల్పా చౌదరి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
హైదరాబాద్: శిల్పా చౌదరి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మూడోసారి పోలీసు కస్టడీకి రాజేంద్రనగర్ కోర్టు అనుమతించింది. దీంతో నార్సింగి పోలీసులు ఒక రోజు విచారణ చేయనున్నారు. చంచల్ గూడ జైలు నుంచి శిల్పా చౌదరిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.
శిల్పా చౌదరి ఆర్థికమోసం కేసు డైలీ సీరియల్ను తలపిస్తోంది. ఆమెను పోలీసులు ఇప్పటికే రెండు పర్యాయాలు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయినా కేసు కొలిక్కి రాకపోవడంతో.. తాజాగా మూడోసారి ఉప్పర్పల్లి కోర్టు శిల్పాచౌదరిని మరో రోజు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.