కోకాపేట యాక్సిస్ బ్యాంకులో ముగిసిన శిల్పా విచారణ

ABN , First Publish Date - 2021-12-14T22:45:42+05:30 IST

నగరంలోని కోకాపేట యాక్సిస్ బ్యాంకులో శిల్పా

కోకాపేట యాక్సిస్ బ్యాంకులో ముగిసిన శిల్పా విచారణ

హైదరాబాద్‌: నగరంలోని కోకాపేట యాక్సిస్ బ్యాంకులో శిల్పా విచారణ ముగిసింది. బ్యాంక్‌ అకౌంట్ లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు తెలుసుకున్నారు. యాక్సెస్ బ్యాంక్ లాకర్‌లో పోలీసులు ఏమీ గుర్తించలేక పోయారు. ఎటువంటి నగదు కాని బంగారు ఆభరణాలు కాని గుర్తించ లేదు. ఓ సొసైటీకి సంబంధించిన డాకుమెంట్స్‌ను మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  విచారణలో తాను మల్టి స్పెషాలిటీ హాస్పిటల్‌లో పెట్టుబడులు పెట్టినట్టు శిల్పా చెప్పింది. అ హాస్పిటల్ సొసైటీకి సంబందించిన డాక్యుమెంట్లను నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాస్పిటల్ సొసైటీలో పెట్టుబడులకు సంబంధించిన వివరాలను  పోలీసులు అరా తీస్తున్నారు. నిజంగానే పెట్టుబడులు పెట్టిందా అనే అంశంపై వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. హాస్పిటల్  సొసైటీ డాక్యుమెంట్లు విచారణలో కీలకం కానున్నాయి.  


బ్యాంక్‌ లాకర్‌లో సిగ్నేచర్‌ విల్లా జిరాక్స్‌ పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సిగ్నేచర్‌ విల్లా ఒరిజినల్‌ పత్రాలు బ్యాంక్‌ లోన్‌లో ఉన్నాయి శిల్పా తెలిపింది. ల్పాకు హయత్‌నగర్‌లో 240 గజాల స్థలం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిగ్నేచర్‌ విల్లా, హయత్‌నగర్‌ ప్లాట్‌ అమ్మి డబ్బులు తిరిగి ఇస్తామని శిల్పా చెప్పింది. 

Updated Date - 2021-12-14T22:45:42+05:30 IST