కర్ణాటక వాసికి దుబాయ్‌లో 24 కోట్ల లాటరీ

ABN , First Publish Date - 2021-03-06T15:40:16+05:30 IST

బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లిన కర్ణాటక వాసికి అదృష్టం తలుపు తట్టింది...

కర్ణాటక వాసికి దుబాయ్‌లో 24 కోట్ల లాటరీ

బెంగళూరు : బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లిన కర్ణాటక వాసికి అదృష్టం తలుపు తట్టింది. లాటరీ టికెట్‌ రూపంలో ఏకంగా రూ.24 కోట్లు కుమ్మరించింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన శివమూర్తి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసి దుబాయ్‌ వెళ్లారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో ఉద్యోగం చేస్తూ 15 ఏళ్లుగా కుటుంబంతో అక్కడే ఉంటున్నారు. గత మూడేళ్ల నుంచి ప్రతినెలా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఫిబ్రవరిలోనూ రెండు లాటరీ టికెట్లు కొనుగోలు చేశారు. వాటిలో ఒక టికెట్‌ నంబరు 202511కు 12 మిలియన్ల దిర్హామ్‌లు.. అంటే భారత కరెన్సీలో రూ.24 కోట్లు బహుమతి వచ్చింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. శుక్రవారం తనకు లాటరీ తగిలిన విషయాన్ని శివమూర్తి స్థానికంగా ఉండే కుటుంబసభ్యులతో పంచుకున్నారు. ఈ డబ్బుతో సొంతూరులో ఓ ఇల్లు నిర్మించుకుంటానని మిగిలిన సొమ్ముతో కుమార్తె, కుమారుడి చదువుతో పాటు వారి బంగారు భవిష్యత్తుకు ప్రణాళిక చేసుకుంటానని శివమూర్తి తెలిపారు.

Updated Date - 2021-03-06T15:40:16+05:30 IST