తాడేపల్లి పీఎస్ నుంచి శివశ్రీ విడుదల
ABN , First Publish Date - 2021-07-21T21:05:52+05:30 IST
తాడేపల్లి పోలీస్స్టేషన్ నుంచి యువతి శివశ్రీ విడుదలయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ప్రభుత్వంలో అవినీతి చూడలేకే
గుంటూరు: తాడేపల్లి పోలీస్స్టేషన్ నుంచి యువతి శివశ్రీ విడుదలయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ప్రభుత్వంలో అవినీతి చూడలేకే ఉద్యోగానికి రాజీనామానని తెలిపారు. నిర్వాసితులకు న్యాయం కోసం జనసేనాని పవన్ని కలిస్తే...పోలీసులు బెదిరించారని చెప్పారు. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని శివశ్రీ మండిపడ్డారు.
బలవంతంగా తమ ఇళ్లను ఖాళీ చేయించాలని చూస్తూ.. అన్యాయం చేస్తున్న వారిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్కు శివశ్రీ గత వారం ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ నేతలు ఆమెపై కక్ష గట్టి... పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు స్టేషన్కు పిలిపించారని తెలిపారు. రెండురోజుల క్రితం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శివశ్రీని పోలీస్ స్టేషన్లో వేచి ఉండేలా చేశారన్నారు. పవన్ కల్యాణ్ ముందు మేకా రామిరెడ్డి పేరు చెప్పినందుకు టార్చర్ చేస్తున్నారన్నారని కుటుంబసభ్యులు తెలిపారు.