ఇస్ర్తీ చేస్తుండగా విద్యుత్ షాక్.. యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-10-30T04:39:36+05:30 IST
ఇస్ర్తీ చేస్తుండగా విద్యుదాఘాతంలో ఒక యువకుడు మృతిచెందాడు.
చాగల్లు, అక్టోబరు 29 : ఇస్ర్తీ చేస్తుండగా విద్యుదాఘాతంలో ఒక యువకుడు మృతిచెందాడు. చాగల్లు అశోక్ నగర్కు చెందిన కడలి వెంకటేశ్వర్లు (28) గురు వారం ఇంటి వద్ద కరెంటు ఇస్ర్తీ పెట్టెతో బట్టలు ఇస్ర్తీ చేసుకుంటుండగా విద్యుదా ఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అతన్ని తొలుత చాగల్లు పీహెచ్సీకి తరలించారు. వైద్యం నిమిత్తం కొవ్వూరు పీహెచ్సీకి తరలిస్తుండగా మృతిచెందాడు.మృతుడి భార్య పల్లవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.