ముగ్గురు టీడీపీ నేతలకు షాక్
ABN , First Publish Date - 2020-06-01T08:59:59+05:30 IST
ప్రకాశం జిల్లాలో ముగ్గురు టీడీపీ నేతలకు ప్రభుత్వం షాకిచ్చింది. గ్రానైట్ రంగంలో ఉన్న ఆ ముగ్గురి క్వారీల నుంచి ఎగుమతులు ..
గ్రానైట్ ఎగుమతుల పర్మిట్లు నిలిపివేత?
ఒంగోలు, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలో ముగ్గురు టీడీపీ నేతలకు ప్రభుత్వం షాకిచ్చింది. గ్రానైట్ రంగంలో ఉన్న ఆ ముగ్గురి క్వారీల నుంచి ఎగుమతులు నిలిపివేసినట్లు తెలిసింది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు క్వారీలో గ్రానైట్ విక్రయాలకు సంబంధించిన పర్మిట్లు నిలిపివేయనున్నారు. అందిన సమాచారం మేరకు ఆ ముగ్గురు నేతల క్వారీల్లో ఉత్పత్తి అయిన గ్రానైట్ ఎగుమతికి సంబంధించి ఇచ్చే పర్మిట్లను గనులశాఖ నిలిపివేయనుంది. ఈ మేరకు సోమవారం నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని తెలిసింది.