ప్రేమ పెళ్లి.. శోభనం రోజు నాడే షాకింగ్ ఘటన.. తెల్లారే వధూవరులను నిద్రలేపేందుకు వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-06-23T18:14:58+05:30 IST

ళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. అష్టకష్టాలు పడి పెద్దలను ఒప్పించారు. పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ల జీవితాంతం హ్యాపీగా ఉంటారని అంతా అనుకున్నారు.

ప్రేమ పెళ్లి.. శోభనం రోజు నాడే షాకింగ్ ఘటన.. తెల్లారే వధూవరులను నిద్రలేపేందుకు వెళ్లి చూస్తే..

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. అష్టకష్టాలు పడి పెద్దలను ఒప్పించారు. పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ల జీవితాంతం హ్యాపీగా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఏమయిందో ఏమో కానీ శోభనం రోజు రాత్రే అనూహ్య ఘటన జరిగింది. వధూవరులు ఇద్దరూ విషం తాగేశారు. విషమ పరిస్థితుల్లో ఉన్న వాళ్లిద్దరినీ బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


బీహార్‌లోని సోనేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్‌షెడ్‌పూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల శాంతీ దేవికి, గోపాల్‌గంజ్ నగరంలోని మిర్జ్‌గంజ్‌కు చెందిన ముకేష్ కుమార్ సింగ్ అనే 30 ఏళ్ల వ్యక్తికి శనివారం ఓ గుడిలో పెళ్లి జరిగింది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం ఆ దంపతులను ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి భోజన కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత నూతన వధూవరులకు శోభనం ఏర్పాటు చేశారు. ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. అయితే ఏమయిందో ఏమో కానీ సోమవారం తెల్లవారుజామున వారిని నిద్రలేపేందుకు వెళ్లిన బంధువులకు అపస్మారక స్థితిలో కనిపించారు. 


పక్కనే చికెన్ కూర కలిపిన అన్నం కూడా ఉంది. దాంట్లోనే విషం కలుపుకుని ఇద్దరూ తిని ఉంటారని అంతా భావిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ పెళ్లే అయినా ఎందుకు ఇలా చేశారన్నది ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. వాళ్లు కోలుకుంటేనే కానీ అసలేం జరిగిందన్నది తెలియదని బంధువులు వాపోతున్నారు.

Updated Date - 2021-06-23T18:14:58+05:30 IST