అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి
ABN , First Publish Date - 2021-05-10T10:33:45+05:30 IST
అమెరికాలో మళ్లీ తుపాకీ గర్జించింది. నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. మరో 13 మంది గాయపడ్డారు.
ఉడ్లాన్(యూఎస్): అమెరికాలో మళ్లీ తుపాకీ గర్జించింది. నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. మరో 13 మంది గాయపడ్డారు. మేరీల్యాండ్లోని ఒక వీధిలో జరిగిన అల్లర్లలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. ఫీనిక్స్లోని ఓ హోటల్లో జరిగిన కాల్పుల్లో ఒకరు చనిపోగా.. ఏడుగురు గాయపడ్డారు. దక్షిణ ఫ్లోరిడాలోని ఎవెంట్యూరా షాపింగ్ మాల్లో రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవ కాల్పులకు దారి తీసింది. ఇరువైపులా కాల్పులు జరగడంతో ముగ్గురు గాయపడ్డారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద శనివారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు.