నిబంధనలు అతిక్రమిస్తే దుకాణాలు సీజ్
ABN , First Publish Date - 2021-05-17T05:30:00+05:30 IST
కొవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే షాపులు సీజ్చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
హిందూపురం టౌన, మే 17: కొవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే షాపులు సీజ్చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం నిబంధనలు ఉల్లంఘించిన షాపులను సీజ్చేసి జరిమానా విధించారు. ఈ సందర్భంగా సీఐలు బాలమద్దిలేటి, మన్సూరుద్దీన, ధరణికిషోర్లు మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. లేదంటే నిబంధనల ప్రకారం కేసులు నమోదుచేసి దుకాణాలు సీజ్చేస్తాం. మరోసారి ఇలాగే జరిగితే మీపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసులతోపాటు మునిసిపల్ సిబ్బందికూడా నిబంధనలు ఉల్లంఘించిన షాపులను సీజ్చేశారు.