పీపీఈలకు కొరత: ఎయిమ్స్
ABN , First Publish Date - 2020-04-09T08:17:55+05:30 IST
కవరాల్స్, మాస్క్లు, గ్లోవ్స్, గాగుల్స్ వంటి వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ)కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో పీపీఈలను శుద్ధిచేసి తిరిగి వినియోగంలోకి తెచ్చే అంశానికి ప్రాధాన్యమివ్వాలంటూ...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కవరాల్స్, మాస్క్లు, గ్లోవ్స్, గాగుల్స్ వంటి వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ)కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో పీపీఈలను శుద్ధిచేసి తిరిగి వినియోగంలోకి తెచ్చే అంశానికి ప్రాధాన్యమివ్వాలంటూ అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) బుధవారం మార్గదర్శకాలను జారీచేసింది. రానున్న రోజుల్లో పీపీఈ కిట్ల కొరత తీవ్రమైతే ఈ దిశగా దృష్టిసారించక తప్పదని పేర్కొంది. కవరాల్స్, ఎన్95 మాస్క్లను డబ్లింగ్ డైల్యూషన్ పద్ధతిలో 11ు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేపర్తో శుద్ధిచేసి తిరిగి వాడవచ్చని తెలిపింది. ఫేస్ షీల్డ్, గాగుల్స్ను 0.5ు సోడియం హైపోక్లోరైడ్, 70ు ఆల్కహాల్ మిశ్రమంతో శుభ్రంచేసి పునర్వినియోగంలోకి తేవచ్చని సూచించింది.