ప్రజలకు అందుబాటులో ఉండాలి
ABN , First Publish Date - 2021-03-02T05:07:09+05:30 IST
ప్రజలకు అందుబాటులో ఉండాలి
నవాబుపేట/కులకచర్ల : గ్రామాలలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేయాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. సోమవారం చించల్పేట, అక్నాపూర్, అత్తాపూర్, పూలపల్లి, నారెగూడ గ్రామాల్లో పర్యటించి శ్మశానవాటికలు, డంపింగ్యార్డులు, పారిశుధ్య, తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుమిత్రమ్మ, ఎంపీవో విజయ్కుమార్, ఏపీవో లక్ష్మీదేవి పాల్గొన్నారు. వైకుంఠధామాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి వినయ్కుమార్ తెలిపారు.పీరంపల్లి గ్రామంలో నిర్మిస్తున్న శ్మశాన వాటిక నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో పీఆర్ ఏఈ మణికుమార్, సర్పంచ్ రాధికసోమలింగం పాల్గొన్నారు.