వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-04-14T05:37:56+05:30 IST
వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోవాలి
సింగరేణి జీఎం నిరీక్షణ్రాజ్
కాకతీయఖని, ఏప్రిల్ 13: ప్రభుత్వం అందించే కరోనా వాక్సిన్ను కార్మికులు, వారి కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ నిరీక్షణ్రాజ్ అన్నారు. సింగరేణి ఆస్పత్రిలో ఆయన కుటుంబ సమేతంగా మంగళవారం టీకా వేయించుకున్నారు. వాక్సిన్పై అపోహలు వద్దన్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం అధికారులకు, కార్మిక కుటుంబాలకు వాక్సిన్ను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.