మెరుగైన విద్య అందించాలి

ABN , First Publish Date - 2020-08-11T11:02:58+05:30 IST

విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని టీ-సాట్‌ సీఈవో శైలే్‌షరెడ్డి అన్నారు. సోమవారం కేయూ ఆధ్వర్యంలో ‘క్రియేటింగ్‌ ఆన్‌లైన్‌

మెరుగైన విద్య అందించాలి

రాష్ట్ర టీసాట్‌ సీఈవో శైలే్‌షరెడ్డి 


కేయూ క్యాంపస్‌, ఆగస్టు 10: విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని టీ-సాట్‌ సీఈవో శైలే్‌షరెడ్డి అన్నారు. సోమవారం కేయూ ఆధ్వర్యంలో ‘క్రియేటింగ్‌ ఆన్‌లైన్‌ లెక్చర్‌’ అనే అంశంపై వెబ్‌నార్‌ జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.లక్ష్మారెడ్డి పాల్గొన్న సమావేశంలో శైలే్‌షరెడ్డి కీలక ప్రసంగం చేశారు. ప్రతీ సబ్జెక్టు పాఠాల వీడియో లైబ్రరీని రూపొందించాలని అన్నారు.


ప్రపంచమంతా ఆన్‌లైన్‌మయం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మాధ్యమం సమస్యగా పరిణమించిందన్నారు. టీసాట్‌ ప్రసారాలను వాడుకోవాలంటే టీవీలు, స్మార్ట్స్‌ఫోన్‌లు అవసరమయ్యానని పేర్కొన్నారు.  అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ డిజిటల్‌ ఇండియాతో దేశ రూపురేఖలు మారుతాయని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ పురుషోత్తంతో పాటు అన్ని విభాగాల శాఖ అఽధ్యాపకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-11T11:02:58+05:30 IST