మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావుకి షోకాజ్ నోటీసులు
ABN , First Publish Date - 2022-01-29T21:29:02+05:30 IST
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ నేత, మాజీ ఎమ్మెల్సీ
హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావుకి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు చేసింది. సీనియర్ నాయకడు వి. హనుమంతరావుపై మంచిర్యాల పర్యటనలో జరగిన దాడి ఘటనపై క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ప్రేం సాగర్కు టీ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు జారీ చేశారు. తనపై దాడి చేసినా చర్యలు తీసుకోవడం లేదని టీపీసీసపై వి.హెచ్ ఆగ్రహం చెందారు. దీంతో మూడు నెలల తరువాత అధిష్ఠానం చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.