మొదటి భర్తకు విడాకులు.. రెండో పెళ్లి కూడా రద్దు.. మాజీ ప్రియుడి ఎంట్రీతో ఆమె లైఫ్ ఎలా టర్న్ అయిందంటే..

ABN , First Publish Date - 2022-01-01T17:21:25+05:30 IST

పెళ్లయిన బాయ్‌ఫ్రెండ్ పెట్టే వేధింపులు భరించేలేక..

మొదటి భర్తకు విడాకులు.. రెండో పెళ్లి కూడా రద్దు.. మాజీ ప్రియుడి ఎంట్రీతో ఆమె లైఫ్ ఎలా టర్న్ అయిందంటే..

పెళ్లయిన బాయ్‌ఫ్రెండ్ పెట్టే వేధింపులు భరించేలేక ఒక యువతి విషాహారం తీసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపధ్యంలోనే ఆమె కన్నుమూసింది. ఈ నేపధ్యంలో మృతురాలి సోదరుడు ఒక యువకునిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ యువకుడు తన సోదరిపై అత్యాచారం చేశాడని, వేధింపులకు గురిచేశాడని, తమ కుటుంబ సభ్యులను కొట్టాడని ఆరోపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఉదంతం రాజస్థాన్‌లోని చిత్తౌడ్‌గఢ్ పరిధిలోని చందేరియా ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల యువతి ఇంటిలో విషాహారం తీసుకుంది. అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమెను ఇంటిలోని వారు ఆసుపత్రికి తరలించారు. 


విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని, బాధితురాలి నుంచి కొంతమేరకు సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా ఆమె తాను గ్రామానికి చెందిన మదన్‌లాల్(27)తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలిపింది. ఈ విషయం ఇంటిలోని వారికి తెలియడంతో వివాదం జరిగిందని పేర్కొంది. కాగా చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది. అనంతరం పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించారు. మృతురాలి సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మదన్‌లాల్ తన సోదరిని వేధించాడని తెలిపాడు. ఈ విషయమై ఇంటిలో తెలియడంతో తన తల్లి తన సోదరిపై చేయిచేసుకున్నదన్నారు. కాగా మదన్ లాల్ పెళ్లయిన వ్యక్తి. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మృతురాలికి గతంలో రెండుసార్లు తలాక్ జరిగింది. దీంతో ఆమె తల్లి, సోదరి దగ్గరే ఉంటూ, మదన్‌లాల్ ప్రేమలో పడి మోసపోయింది.

Updated Date - 2022-01-01T17:21:25+05:30 IST