America: శ్యామ్ సింగరాయ్ మూవీ విషయంలో కీలక అప్‌డేట్.. అదేంటంటే..

ABN , First Publish Date - 2021-12-30T01:12:03+05:30 IST

శ్యామ్ సింగరాయ్.. క్లాసికల్ బ్లాక్ బస్టర్ మూవీగా హిట్ టాక్ సొంతం చేసుకుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా.. సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. దీంతో

America: శ్యామ్ సింగరాయ్ మూవీ విషయంలో కీలక అప్‌డేట్.. అదేంటంటే..

ఎన్నారై డెస్క్: శ్యామ్ సింగరాయ్.. క్లాసికల్ బ్లాక్ బస్టర్ మూవీగా హిట్ టాక్ సొంతం చేసుకుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా.. సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. దీంతో మూవీ చూసేందుకు సగటు సినిమా ప్రేక్షకులు.. థియేటర్లకు క్యూ కడుతున్నారు. అమెరికాలో ఈ మూవీని చూసేందుకు తెలుగు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే యూఎస్‌లోని 256 థియేటర్లలతో ఈ మూవీని రిలీజ్ చేసిన రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ తాజాగా కీలక విషయాన్ని ప్రకటించింది. రెండో వారం నుంచి ఈ సినిమాని అమెరికా వ్యాప్తంగా ఉన్న మరో 20కిపైగా థియేటర్లలో ప్రదర్శించబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాకుండా.. ఇప్పటి వరకూ ఈ సినిమా అమెరికాలో దాదాపు రూ.4.47కోట్లను రాబట్టినట్టు పేర్కొంది. 


ఇదిలా ఉంటే.. పునర్జన్మల కథాశంతో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా.. ద్విపాత్రాభినయంలో నేచురల్ స్టార్ అదరగొట్టాడు. ఎప్పటిలాగే సాయిపల్లవి తన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఫదా చేయగా.. కృతిశెట్టి సైతం యువతను అలరించింది. 




Updated Date - 2021-12-30T01:12:03+05:30 IST