శ్యాంప్రసాద్ ముఖర్జీ సేవలు మరువలేనివి
ABN , First Publish Date - 2021-06-24T04:26:30+05:30 IST
శ్యాంప్రసాద్ ముఖర్జీ సేవలు మరువలేనివని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారుశ్రుతి, జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావులు అన్నారు.
కందనూలు, జూన్ 23: శ్యాంప్రసాద్ ముఖర్జీ సేవలు మరువలేనివని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారుశ్రుతి, జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావులు అన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బీజేపీ జిల్లా కా ర్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బారెడ్డి, నాగర్కర్నూల్ బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి నెడనూరి దిలీపాచారి, జిల్లా నాయకుడు రాజవర్దన్రెడ్డి, మహిళా మోర్చా నాయకురాలు అపర్ణారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్చంద్ర, బీజేపీ నాయకుడు ఎలిమె రాజు తదితరులు ఉన్నారు.
భరతమాత ముద్దుబిడ్డ శ్యాంప్రసాద్ ముఖర్జీ
కల్వకుర్తి టౌన్: భారతదేశాన్ని విడగొట్టే 370 జీవోను వ్యతిరేకిస్తూ పోరా టం చేసి భారతసమాఖ్య విఘాతాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ప్రాణాలు వదిలిన మహానాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బోడ నర్సింహ తెలిపారు. కల్వకుర్తిలోని బీజేపీ కార్యాలయంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదానం దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అ ర్పించారు. నాడు శ్యాంప్రసాద్ ముఖర్జీ కన్న కలలను నేటి ప్రధాని నరేంద్ర మోదీ 370 జీవోను రద్దు చేసి నెరవేర్చారని గుర్తు చేశారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్గౌడ్, బీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రవిగౌడ్, నాయకులు శేఖర్రెడ్డి, నరేష్గౌడ్ పాల్గొన్నారు.