పెళ్లైన వారం రోజులకే వికారాబాద్ ఎస్ఐ దుర్మరణం

ABN , First Publish Date - 2022-01-02T02:24:00+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని

పెళ్లైన వారం రోజులకే వికారాబాద్ ఎస్ఐ దుర్మరణం

నల్గొండ: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని చింతపల్లి మండలం మాల్ వద్ద దేవరకొండ డిపో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో వికారాబాద్ వన్‌టౌన్ ఎస్ఐ శ్రీను నాయక్ (32), ఆయన తండ్రి మాన్య నాయక్(50) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్య తండా వాసులుగా గుర్తించారు. శ్రీను నాయక్ వారం క్రితమే వికారాబాద్ వన్‌టౌన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 26న శ్రీనుకు వివాహం జరిగింది. వడిబియ్యం కార్యక్రమం ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తండ్రి మాన్య ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల తండ్రి చేతికి గాయం కావడంతో ఎస్ఐ శ్రీను నాయక్ స్వయంగా ఆటో నడిపాడు. ఆటోలో ప్రయాణించిన తండ్రీకొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కాళ్ళపారాణి ఆరకముందే ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.  

Updated Date - 2022-01-02T02:24:00+05:30 IST