ఘర్షణలో ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలు
ABN , First Publish Date - 2021-06-17T04:20:23+05:30 IST
జిల్లాలో జరిగిన ఘర్షణలో ఎస్ఐ, కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. జగ్గయ్యపేట
కృష్ణా: జిల్లాలో జరిగిన ఘర్షణలో ఎస్ఐ, కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. జగ్గయ్యపేట మండలంలోని చిల్లకల్లులో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణను ఆపడానికి వెళ్లిన ఎస్ఐ రమేష్, ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి డీఎస్పీ నాగేశ్వర్రెడ్డి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘర్షణకు కారణమైన 15 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.