సిద్దిపేట: శ్రీ విద్యాధరి అమ్మవారి ఆలయంలో మొదలైన శరన్నవరాత్రి ఉత్సవాలు
ABN , First Publish Date - 2021-10-07T16:17:46+05:30 IST
జిల్లాలోని వర్గల్ మండల కేంద్రంలో శంబుని కొండపై కొలువుదీరిన శ్రీ విద్యాధరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి.
సిద్దిపేట: జిల్లాలోని వర్గల్ మండల కేంద్రంలో శంబుని కొండపై కొలువుదీరిన శ్రీ విద్యాధరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. 14 వరకు జరిగే ఉత్సవాలకు తొలి రోజు ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర్ సిద్ధాంతి అంకురార్పణ చేశారు. తొలి రోజు బాల త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.