దమ్ముంటే ఆ ఒక్క సీటే ఎంచుకో.. సిద్ధూ సవాల్

ABN , First Publish Date - 2022-01-29T20:52:02+05:30 IST

శిరోమణి అకాలీ దళ్ నేత బిక్రం సింగ్ మజిథియాకు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ..

దమ్ముంటే ఆ ఒక్క సీటే ఎంచుకో.. సిద్ధూ సవాల్

చండీగఢ్: శిరోమణి అకాలీ దళ్ నేత బిక్రం సింగ్ మజిథియాకు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సవాలు విసిరారు. రెండు సీట్లలో కాకుండా దమ్ముంటే అమృత్‌సర్ ఈస్ట్ నియోజవర్గంలో మాత్రమే తనపై పోటీ చేయాలని బిక్రం సింగ్‌ను ఆయన సవాలు చేశారు. మజిథియాను అమృత్‌సర్‌ ఈస్ట్ నియోజకవర్గంతో పాటు పొరుగున ఉన్న మజిథా నుంచి సాద్ పోటీలోకి దింపుతోంది. కాంగ్రెస్ నుంచి అమృత్‌సర్ ఈస్ట్ అభ్యర్థిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ బరిలో ఉన్నారు.


మజిథియాను రెండు చోట్ల పోటీలోకి దింపాలని అకాలీదళ్ తీసుకున్న నిర్ణయంపై సిద్ధూ మాట్లాడుతూ, మజిథియా పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అది ఆయన ప్రజాస్వామిక హక్కు అని అన్నారు. అయితే, హోరాహోరీ యుద్ధంగా భావిస్తే మాత్రం ఆయన మజిథా నియోజకవర్గం వదిలి ఒక్క అమృత్‌సర్ ఈస్ట్ నుంచే తనపై పోటీకి దిగాలని సవాలు చేశారు. బిక్రం సింగ్ మజిథియా గతంలో 2007,2012,2017 ఎన్నికల్లో మజిథా నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు.

Updated Date - 2022-01-29T20:52:02+05:30 IST