సిద్దూకు డిప్యూటీ సీఎం పదవి!

ABN , First Publish Date - 2021-06-11T02:19:00+05:30 IST

పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య తలెత్తిన విభేదాలకు కాంగ్రెస్

సిద్దూకు డిప్యూటీ సీఎం పదవి!

న్యూఢిల్లీ : పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య తలెత్తిన విభేదాలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఓ మార్గం చూపారు. ఈ వివాదాన్ని ‘డిప్యూటీ సీఎం’ పదవితో పుల్‌స్టాప్ పెట్టాలని సోనియా గాంధీ భావించారు. నవజ్యోత్ సింగ్ సిద్దూకు డిప్యూటీ సీఎం పదవిని అధిష్ఠానం ఇవ్వనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్దూను తాము పక్కన పెట్టమని, ఆయన సేవలు వినియోగించుకుంటామని అధిష్ఠానం పెద్దలు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం కుదరని పక్షంలో ప్రచార కమిటీ చైర్మన్ పదవిని ఇవ్వాలని సోనియా గాంధీ డిసైడ్ అయ్యారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం అమరీందర్ సింగే ఉంటారని అధిష్ఠానం తేల్చి చెప్పింది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వాన్ని బలపరిచారని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికలో పేర్కొంది.  మరోవైపు సీఎం అమరీందర్, సిద్దూ మధ్య తలెత్తిన వివాద పరిష్కారానికి అధిష్ఠానం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ రిపోర్టును ఈ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించారు. 

Updated Date - 2021-06-11T02:19:00+05:30 IST