నిబంధనలు ఉల్లంఘించిన షాపులు సీజ్‌

ABN , First Publish Date - 2021-05-08T05:14:24+05:30 IST

నగరంలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన ఆరు షాపులను అధికారులు సీజ్‌ చేశారు.

నిబంధనలు ఉల్లంఘించిన షాపులు సీజ్‌

విజయనగరం క్రైం, మే 7:  నగరంలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన ఆరు షాపులను అధికారులు సీజ్‌ చేశారు.  శుక్రవారం ఆర్డీవో భవానీశంకర్‌, విజయనగరం డీఎస్పీ అనిల్‌కుమార్‌  మూడు లాం తర్లు నుంచి గంటస్తంభం వరకూ పర్యటించారు. కర్ఫ్యూ అమలును పరిశీలించారు. అయితే కొన్ని షాపుల్లో రద్దీగా ఎక్కువగా ఉండడం, నిబం ధనలకు విరుద్ధంగా ప్రజలను లోపలికి అనుమతించడాన్ని గుర్తించారు.  ఈ మేరకు ఆరు షాపులను పరిశీలించి సీజ్‌ చేయించారు.   కర్ఫ్యూ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరిం చారు.  కరోనా ఉధృతిని తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలన్నారు. జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో షాపుల్లోకి వినియోగదారులను అనుమతించరాదని తెలిపారు. 


Updated Date - 2021-05-08T05:14:24+05:30 IST