ఢిల్లీ ప్రభుత్వ ప్రకటనలో సిక్కిం స్వతంత్ర దేశం!

ABN , First Publish Date - 2020-05-24T07:26:38+05:30 IST

సివిల్‌ డిఫెన్స్‌ కోర్ప్స్‌లో వాలంటీర్ల భర్తీకి ఢిల్లీ ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ప్రకటనలో సిక్కిం స్వతంత్ర దేశం అని పేర్కొన్నది. అర్హతల కాలమ్‌లో అభ్యర్థి భారత పౌరుడై ఉండాలంటూ నేపాల్...

ఢిల్లీ ప్రభుత్వ ప్రకటనలో సిక్కిం స్వతంత్ర దేశం!

న్యూఢిల్లీ,మే 23: సివిల్‌ డిఫెన్స్‌ కోర్ప్స్‌లో వాలంటీర్ల భర్తీకి ఢిల్లీ ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ప్రకటనలో సిక్కిం స్వతంత్ర దేశం అని పేర్కొన్నది. అర్హతల కాలమ్‌లో అభ్యర్థి భారత పౌరుడై ఉండాలంటూ నేపాల్‌, భూటాన్‌ సరసన సిక్కింను చేర్చడం వివాదాస్పదమైంది. సీఎం కేజ్రీవాల్‌ ఫొటో తో ప్రచురించిన ఈ ప్రకటనపై నెటిజన్లతో సహా బీజేపీ నేత కపిల్‌ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-05-24T07:26:38+05:30 IST