గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి
ABN , First Publish Date - 2021-04-19T05:50:45+05:30 IST
గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
పటాన్చెరు, ఏప్రిల్ 18: గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలంలోని పాశమైలారంలో రూ.67లక్షల నిధులతో చేపట్టిన బీటీ రోడ్లు, అంతర్గగత మురుగునీటి కాల్వలు, వీధిదీపాలు, సంపు తదితర పనులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాశమైలారం పారిశ్రామిక వాడలోని టీఎ్సఐఐసీ భూములను డబుల్ బెడ్రూం ఇళ్లకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని గ్రామస్థులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిఽధులతో పాటు ప్రభుత్వ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలన్నారు. లేదా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని పంచాయతీ కార్యదర్శి శివకాంతంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ పోచయ్య, ఉపసర్పంచ్ కృష్ణాయాదవ్, టీఆర్ఎస్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, నిరంజన్రెడ్డి, చందు, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.