తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 5 లక్షలు ప్రకటించిన సింధు

ABN , First Publish Date - 2020-03-26T19:51:55+05:30 IST

కరోనాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద యుద్ధమే జరుగుతోంది. లాక్‌డౌన్ ప్రకటించి.. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసిన ప్రభుత్వాలు..

తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 5 లక్షలు ప్రకటించిన సింధు

హైదరాబాద్: కరోనాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద యుద్ధమే జరుగుతోంది. లాక్‌డౌన్ ప్రకటించి.. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసిన ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సహాయకార్యక్రమాలు కూడా చేపట్టాయి. కరోనాపై యుద్ధానికి తమవంతు బాధ్యతగా సినీ, క్రీడాప్రముఖులు భూరి విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చేరారు. తనవంతుగా తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 5 లక్షలు ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా సింధు తెలిపారు. 


ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ దేశానికి రూ.కోటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకూ చెరో రూ.50 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే త్రివిక్రమ్ రూ.20 లక్షలగ, రామ్ చరణ్ రూ.70 లక్షలు, నితిన్ రూ.10 లక్షలు, నిర్మాత దిల్ రాజు చెరో రూ.10 లక్షలు, దర్శకుడు కొరటాల శివ చెరో రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు. 



Updated Date - 2020-03-26T19:51:55+05:30 IST