సింధు ప్రోత్సాహానికి కన్నీళ్లొచ్చాయి: తై జు

ABN , First Publish Date - 2021-08-02T21:16:08+05:30 IST

ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తై జుయింగ్ ఫైనల్స్‌లో ఓడిన అనంతరం పెట్టిన పోస్టు భారత అభిమానులను ఆకట్టుకుంది. సెమీస్‌లో తన చేతిలో ఓడిన సింధు ఫైనల్స్ ముందు తనను ఎంతగానో ప్రోత్సహించిందంటూ

సింధు ప్రోత్సాహానికి కన్నీళ్లొచ్చాయి: తై జు

టోక్యో: ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తై జుయింగ్ ఫైనల్స్‌లో ఓడిన అనంతరం పెట్టిన పోస్టు భారత అభిమానులను ఆకట్టుకుంది. సెమీస్‌లో తన చేతిలో ఓడిన సింధు ఫైనల్స్ ముందు తనను ఎంతగానో ప్రోత్సహించిందంటూ ఇన్‌స్టాగ్రాంలో సింధుతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది. సెమీస్‌లో తన చేతిలో ఓడిన సింధు.. ఫైనల్స్ ముందు నిస్వార్థంగా తనను ప్రోత్సహించిన తీరు, ఫైనల్‌లో ఓటమి తరువాత ఓదార్చిన తీరుతో భావోద్వేగానికి గురయ్యానని కన్నీళ్లు ఉబికి వచ్చాయని పేర్కొంది.


‘‘ఫైనల్‌లో నా ఆట సంతృప్తిగానే అనిపించింది. మ్యాచ్ ముగిశాక సింధు నా వద్దకు వచ్చి కౌగిలించుకుని.. నువ్ బాగా ఆడావ్, కానీ ఈ రోజు నీది కాదు అని నన్ను హత్తుకుని ఓదార్చింది. ఆమె ఓదార్చిన తీరుకు నాకు కన్నీళ్లొచ్చాయి. సింధు మద్దతుకు, ఇచ్చిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు’’ అని ఇన్‌స్టా ఖాతాలో తైజు పోస్ట్ చేసింది.


నిన్న జరిగిన ఫైనల్స్‌లో చైనా క్రీడాకారిణి చెన్ యుఫీ చేతిలో తై జుయింగ్ ఓటమి పాలయి రజతంతో సరిపెట్టుకుంది. అంతకు ముందు భారత స్టార్ షట్లర్ పీవీ సింధును వరుస సెట్లలో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా కాంస్య పతకం కోసం నిన్న జరిగిన పోరులో హి బింగ్జియావోను వరుస సెట్లలో ఓడించిన సింధు దేశానికి ఒలింపిక్స్‌లో మరో పతకాన్ని అందించింది.


Updated Date - 2021-08-02T21:16:08+05:30 IST