ఇండోనేషియా మాస్టర్ టోర్నమెంట్ సెమీ-ఫైనల్లో పీవీ సింధు ఓటమి

ABN , First Publish Date - 2021-11-20T23:16:15+05:30 IST

ఇండోనేషియా మాస్టర్ టోర్నమెంట్ సెమీ-ఫైనల్లో పీవీ సింధు ఓటమి

ఇండోనేషియా మాస్టర్ టోర్నమెంట్ సెమీ-ఫైనల్లో పీవీ సింధు ఓటమి

న్యూఢిల్లీ: ఇండోనేషియా మాస్టర్ టోర్నమెంట్ సెమీ-ఫైనల్లో టాప్ సీడ్ యమగూచి చేతిలో భారత క్రీడాకారిణి, ఒలింపిక్స్ మెడలిస్ట్ పీవీ సింధు ఓటమి పాలయ్యారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి అకానే యమగూచి 21-13, 21-9 తేడాతో పీవీ సింధును ఓడించింది. యమగూచి చేతిలో పీవీ సింధు ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఓటమిపాలైంది. మహిళల ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సెయోంగ్‌తో జపాన్ తలపడనుంది. పురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్లో మూడోసీడ్‌ ఆండర్స్‌ ఆంటోన్‌సెన్‌తో భారత క్రీడాకారుడు శ్రీకాంత్‌ తలపడనున్నారు. 

Updated Date - 2021-11-20T23:16:15+05:30 IST