నేడు హైదరాబాద్కు సింధు
ABN , First Publish Date - 2021-08-04T09:21:04+05:30 IST
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం టోక్యో నుంచి ఢిల్లీకి చేరుకున్న సింధుకు ఆమె కుటుంబ సభ్యులు...
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం టోక్యో నుంచి ఢిల్లీకి చేరుకున్న సింధుకు ఆమె కుటుంబ సభ్యులు, టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని, భారత బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అభినందన సభలో సింధు పాల్గొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జి. కిషన్రెడ్డి, క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ సింధును అభినందించి ఘనంగా సత్కరించారు. సింధు సాధించిన పతకం భారతావనిని పులకింప చేసిందని మంత్రులు కొనియాడారు. ఈ అభినందన వేడుకలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, టీజీ వెంకటేశ్, సోయం బాపురావు కూడా పాల్గొన్నారు.