కొద్ది రోజుల్లో మరణశిక్ష అనగా.. కరుణించిన న్యాయస్థానం.. భారతీయ సంతతి వ్యక్తికి ఊరట..!

ABN , First Publish Date - 2021-11-09T02:57:55+05:30 IST

ప్రపంచ ప్రజల వినతులకు సింగపూర్ న్యాయస్థానం తలొగ్గింది. భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్ ధర్మలింగమ్‌కు విధించిన మరణశిక్ష అమలును నిలిపివేస్తున్నట్టు తాజాగా తీర్పిచ్చింది.

కొద్ది రోజుల్లో మరణశిక్ష అనగా.. కరుణించిన న్యాయస్థానం.. భారతీయ సంతతి వ్యక్తికి ఊరట..!

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ప్రజల వినతులకు సింగపూర్ న్యాయస్థానం తలొగ్గింది. భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్ ధర్మలింగమ్‌కు విధించిన మరణశిక్ష అమలును నిలిపివేస్తున్నట్టు తాజాగా తీర్పిచ్చింది. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తిని ఉరితీయడం అమానవీయమని, మానవహక్కులు ఉల్లంఘించడమేనని అనేక స్వచ్ఛంద సంఘాలు, మానవహక్కుల కార్యకర్తలు ఉద్యమించడంతో న్యాయస్థానం శిక్షను నిలిపివేసింది. సింగపూర్‌లోకి మాదకద్రవ్యాల్ని తరలిస్తూ 2009లో పోలీసులకు చిక్కిన నాగేంద్రకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. గత పదేళ్లుగా అతడు జైల్లోనే మగ్గుతున్నాడు. ఇటీవల శిక్ష అమలకు అక్కడి అధికారులు ఉపక్రమించారు. అయితే..ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల కార్యకర్తలు, సంఘాలు ఉద్యమించడంతో కోర్టు నిందితుడిపై కరుణించింది. శిక్షను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


Updated Date - 2021-11-09T02:57:55+05:30 IST