పిల్లలపై కొన్ని కరోనా వేరియంట్ల తీవ్ర ప్రభావం.. స్కూళ్లు మూసేసిన సింగపూర్

ABN , First Publish Date - 2021-05-18T03:52:06+05:30 IST

కరోనా తీవ్రత పెరగడంతో సింగపూర్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ వైరస్ వివిధ వేరియంట్లు పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరికలు చేస్తున్న తరుణంలో..

పిల్లలపై కొన్ని కరోనా వేరియంట్ల తీవ్ర ప్రభావం.. స్కూళ్లు మూసేసిన సింగపూర్

సింగపూర్: కరోనా తీవ్రత పెరగడంతో సింగపూర్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ వైరస్ వివిధ వేరియంట్లు పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరికలు చేస్తున్న తరుణంలో.. ఈ నెల 19 నుంచి 28 వరకూ స్కూళ్లు బంద్ చేస్తున్నట్లు సింగపూర్ ప్రకటించింది. కొన్ని కరోనా వేరియంట్లు పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతాయని, ఇది ప్రమాదకరమైన అంశమని పేర్కొన్న ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సింగపూర్ విద్యాశాఖ మంత్రి చాన్ చున్ సింగ్ వెల్లడించారు. ఈ దేశంలోనే ఆదివారం నాడు 38 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ లోకల్ ట్రాన్స్‌మిషన్ కేసులేనని తేలింది. గతేడాది సెప్టెంబరు తర్వాత ఇన్ని కేసులు నమోదవడం ఈ ద్వీపదేశంలో ఇదే తొలిసారి.

Updated Date - 2021-05-18T03:52:06+05:30 IST