రూ.లక్ష విరాళాం ఇచ్చిన గాయని
ABN , First Publish Date - 2022-01-25T05:06:02+05:30 IST
ఓర్వకల్లు పొదుపు మహిళలు స్వయంశక్తితో నిర్మించి, నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు ప్రముఖ గాయనీ సునీత రూ.లక్ష విరాళాన్ని అందించారు.
కర్నూలు(కల్చరల్), జనవరి 24: ఓర్వకల్లు పొదుపు మహిళలు స్వయంశక్తితో నిర్మించి, నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు ప్రముఖ గాయనీ సునీత రూ.లక్ష విరాళాన్ని అందించారు. గత అక్టోబరు నెలలో కర్నూలు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి ఆహ్వానం మేరకు బాలభారతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన సునీత భవిష్యత్లో బాలభారతి పాఠశాలకు తమ వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఆర్థిక సహకారంతో పాటు సునీత తల్లి ప్రముఖ సంగీత గురువు ఉపద్రష్ట సుమతి బాలభారతి పాఠశాలలోని విద్యార్థులకు ఆన్లైన్లో ఉచితంగా సంగీత పాఠాలు నేర్పిస్తున్నట్లు ఓర్వకల్లు పొదుపు సంఘం నిర్వహకురాలు విజయభారతి తెలిపారు. సునీత అందిస్తున్న సహకారానికి బాలభారతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.