కాల్వల ద్వారా వరినాట్లకు సింగూరు నీళ్లు
ABN , First Publish Date - 2021-01-16T06:07:02+05:30 IST
యాసంగి వరినాట్లు వేసేందుకు సింగూరు ప్రాజెక్టు నుంచి ఈనెల 11వ తేదీన నీటిని విడుదల చేయగా శుక్రవారం ఎంఎన్ కెనాల్ గుండా మండలంలోకి ప్రవేశించాయి.
హవేళీఘణపూర్, జనవరి 15 : యాసంగి వరినాట్లు వేసేందుకు సింగూరు ప్రాజెక్టు నుంచి ఈనెల 11వ తేదీన నీటిని విడుదల చేయగా శుక్రవారం ఎంఎన్ కెనాల్ గుండా మండలంలోకి ప్రవేశించాయి. ఈ కాల్వ ద్వారా ముత్తాయికోట, తొగిట, కూచన్పల్లి, శాలిపేట, భూపతిపూర్, ముత్తాయిపల్లి, తదితర గ్రామాలకు సింగూరు నీరు చేరనుంది. నీరు రావడంతో ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు.