ఆదిత్యుని దర్శించుకున్న సినీనటి ప్రగతి
ABN , First Publish Date - 2021-10-24T05:13:31+05:30 IST
అరసవల్లి సూర్య నారాయణస్వామివారిని సినీనటి ప్రగతి శనివారం దర్శించుకున్నారు.
గుజరాతీపేట: అరసవల్లి సూర్య నారాయణస్వామివారిని సినీనటి ప్రగతి శనివారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదిం చారు. స్వామివారి చిత్రపటాన్ని ఈవో హరిసూర్యప్రకాష్ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు కుమ్మరి క్రాంతికు మార్లు కూడా ఆదిత్యుని దర్శించుకు న్నారు. కార్యక్రమంలో ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ సూపరింటెండెంట్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.