ఐదో పేసర్‌ రేసులో సిరాజ్‌, శార్దూల్‌

ABN , First Publish Date - 2020-10-21T08:47:40+05:30 IST

భారత టెస్టు జట్టులో ఐదో పేసర్‌ స్థానం కోసం హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ మధ్య పోటీ నెలకొంది. భువనేశ్వర్‌, ఇషాంత్‌ శర్మ ఐపీఎల్‌లో గాయపడి

ఐదో పేసర్‌ రేసులో సిరాజ్‌, శార్దూల్‌

న్యూఢిల్లీ: భారత టెస్టు జట్టులో ఐదో పేసర్‌ స్థానం కోసం హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ మధ్య పోటీ నెలకొంది. భువనేశ్వర్‌, ఇషాంత్‌ శర్మ ఐపీఎల్‌లో గాయపడి జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. వీరి గైర్హాజరీతో నాలుగో పేసర్‌గా సైనీకి అవకాశాలు మెరుగయ్యాయి. ఇక ఐదో పేసర్‌గా సిరాజ్‌, శార్దూల్‌లలో ఒకరు ఎంపికవడం ఖాయం. రంజీ ట్రోఫీ, భారత్‌ ‘ఎ’ జట్ల తరఫున సిరాజ్‌ అద్భుత ప్రదర్శన  కనబర్చగా.. కొత్త బంతిని ఠాకూర్‌ చక్కగా స్వింగ్‌ చేయగలడు. ఐపీఎల్‌ ముగిసిన వెంటనే మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల కోసం వచ్చే నెలలో జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.

Updated Date - 2020-10-21T08:47:40+05:30 IST