సిరిసిల్ల జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-08-18T22:43:07+05:30 IST

సిరిసిల్ల జిల్లాను సంపూర్ణంగా సస్యశ్యామలం చేస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించే

సిరిసిల్ల జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: కేటీఆర్‌

సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాను సంపూర్ణంగా సస్యశ్యామలం చేస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు. జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై హైదరాబాదులో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎమ్మెల్యేలు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులు హాజరైనారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు జాలల రాకతో జిల్లాలో వ్యవసాయ సాగు పెరిగిందని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

Updated Date - 2021-08-18T22:43:07+05:30 IST